Saturday 31 January 2015


Tradition to donate Cows at Simhachalam Temple Visakhapatnam ( Information in Telugu)

శ్రీ వరహా లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం - సింహాచలం అప్పన్న సన్నిదిలోకోడెదూడాల మ్రొక్కుబడి 
 Simhachalam Temple Goshala

Simhachalam Temple

శ్రీ వరహా లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో గ్రామీణ ప్రాంతములు నుండి వచ్చిన భక్తులు ఆవులను, కోడె దూదలను మొక్కుబడి గా సమర్పణ చేయుట చాలాకాలము నుండి ఆచారము గా వస్తుంది. ప్రాచీన కాలం నాటి సింహాచల శాసనములలో శ్రీవారహలక్ష్మీనృసింహస్వామి వారి అభిషేకానికి, సుప్రభాతానికి, రాజభోగానికి, పవళింపు సేవకి స్వామి వారి ఉపయోగం కోసం పాలు, పెరుగుల కోసం ఎందరో మహానుభావులు కేవలం దేశీయ జాతి ఆవులను వత్సలలొ (పెయ్య) పాలు ఇస్తున్న ఆవులను సమర్పిస్తూ వాటి ఆహారములకు, పోషణకు, స్మరక్షకుల కొరకు కొంత భూమిని కూడా సమర్పించినట్లు ఆధారాలు కానవస్తున్నాయి. కోడె దూదలను భక్తులు కొండకు తీసుకు వచ్చి స్వామి వారి కి చూపించి మరల వారే వారి గ్రామాలకు తీసుకొనిపోయే చరము చాలా కాలం నుండి ఉన్నది.
Read More : About Simhachalam Temple

Related Tags : #Simhachalaminfo, #Telugu,#Goshala,#TeluguCulture
  • RSS
  • Delicious
  • Digg
  • Facebook
  • Twitter
  • Linkedin
  • Youtube